Islamabad | భారత్పై పాకిస్తాన్ కీలక ఆరోపణలు చేసింది. తమపై భారత్ నకిలీ ఆపరేషన్ చేసేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అసీమ్ ఇఫ్తికార్ మహ్మద్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న పరిస్థితులను మరింత జటిలం చేయడానికే తమపై భారత్ తప్పుడు ఆపరేషన్కు పాల్పడే అవకాశాలున్నాయని అన్నారు. భారత్ ట్రాక్ రికార్డును తాము పరిగణనలోకి తీసుకున్నామని, అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
కశ్మీర్ విషయంతో పాటు దీర్ఘ కాలంగా ఉన్న పెండింగ్ సమస్యలపై కూడా భారత్తో చర్చించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, శాంతియుతంగా చర్చలు జరపడానికి తాము రెడీగానే ఉన్నామని అసీమ్ ఇఫ్తికార్ ప్రకటించారు. అయితే అందుకు తగ్గ పరిస్థితులను సృష్టించాల్సిన బాధ్యత భారత్పైనే ఉందన్నారు. అయితే ఈ భారత్ ధృక్కోణంలో ఇంకా మార్పే రావడం లేదని ఆయన విమర్శించారు. మరోవైపు కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఇప్పటికీ కట్టుబడే ఉన్నాయని, ఇంకా అమలులోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే అఖండ భారత్ కోసం కృషి చేస్తున్న భారత్.. ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.