న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పాకిస్థాన్లో కార్ల విక్రయాలు రివర్స్ గేర్లో నడుస్తున్నాయి. నవంబర్లో కేవలం 4,876 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 15,432 యూనిట్లతో పోలిస్తే 68 శాతం తగ్గుదల నమోదైనట్టు పాకిస్థాన్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (పీఏఎంఏ) వెల్లడించింది. దీనికి భిన్నంగా భారత్లో గంటకు 500 కార్లు చొప్పున నవంబర్లో 3.6 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. రానున్న కాలంలో పాకిస్థాన్లో ఆటోమొబైల్ రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కోనుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ వాహన తయారీ కంపెనీలు టెస్లా, బీవైడీ, జీడబ్ల్యూం లాంటివి పాకిస్థాన్లో తమ కార్యకలాపాలకు స్వస్తి పలికి భారత్లో తమ మార్కెట్ను విస్తరించడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. ఒక పక్క దక్షిణాసియాలో సైతం ఈ పరిశ్రమ మంచి పురోభివృద్ధి సాధిస్తుండగా, పాకిస్థాన్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.