అహ్మదాబాద్, సెప్టెంబర్ 14: గుజరాత్లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. రూ.200కోట్ల విలువైన డ్రగ్స్ను రవాణా చేస్తూ ఆరుగురు పాకిస్థానీ స్మగ్లర్లు బుధవారం దొరికిపోయారు.
ఓ ఫిష్ బోట్లో డ్రగ్స్తో వస్తున్న పాకిస్థాన్ పౌరులను అరేబియా సముద్రంలోని గుజరాత్ జకావ్ తీరంలో ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్).. ఇండియన్ కోస్ట్ గార్డ్తో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ ద్వారా పట్టుకున్నది. వారి వద్ద రూ. 200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ దొరకగా, సీజ్ చేశారు. ఆరుగురు పాకిస్థాన్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్ను సముద్రమార్గాన గుజరాత్ తీరానికి చేర్చి అక్కడినుంచి పంజాబ్కు రవాణా చేసేందుకు స్మగ్లర్లు ప్రణాళిక వేశారని అధికారులు తెలిపారు.