న్యూఢిల్లీ : ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ స్ధానికుడితో పరిచయం పెంచుకున్న పాకిస్తానీ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలో అక్రమంగా నివసిస్తోంది. పాక్ మహిళ సహా ఆమె నలుగురు పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అద్దె ఇంట్లో వారికి ఆశ్రయం కల్పించిన గ్రేటర్ నోయిడాకు చెందిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పాక్ మహిళతో పాటు ఆమెకు వసతి కల్పించిన వ్యక్తిని నిర్భందంలోకి తీసుకున్నామని, మహిళ పిల్లలు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారని డీసీపీ (గ్రేటర్ నోయిడా) మియా ఖాన్ చెప్పారు. ఆన్లైన్ గేమ్ పబ్జీ వేదికగా పాక్ మహిళ, స్ధానిక వ్యక్తి పరిచయమయ్యారని, దీంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి నోయిడాకు వచ్చి అక్రమంగా నివసిస్తోందని తెలిపారు. గత నెల నేపాల్ మీదుగా పాక్ మహిళ అక్రమంగా భారత్లోకి ప్రవేశించిందని, ఆపై యూపీలో ఎంటరై బస్సులో గ్రేటర్ నోయిడాకు చేరుకుందని చెప్పారు.
Read More :