ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్లోని రెండు మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో ఓ పాక్ సైనికుడు మరణించాడు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇక.. ఈ కాల్పుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన నలుగురు ఉగ్రవాదులు మరణించారు. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీజింగ్ పర్యటనకు వెళ్తున్న సందర్భంలోనే ఈ దాడులు జరిగాయి. ఈ దాడులపై పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పందించారు. ఉగ్రదాడులను పాక్ సైనికులు వీరోచితంగా తిప్పికొట్టారని, వారికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఇక ఈ దాడులపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా స్పందించింది. ఈ దాడుల్లో 50 మందికి పైగా పాక్ సైనికులు మరణించారని, తామే ఈ దాడులు చేశామని ప్రకటించారు.