మనిషికి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. జీవితంలో ఒకేసారి అదృష్టం వరిస్తుంది. అప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందన్నట్టుగా.. కేరళకు చెందిన ఈ పెయింటర్కు కూడా ఒక రోజు వచ్చింది. ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. తన జీవితంలో కూడా చూడలేని డబ్బును చూశాడు.
కొట్టాయంకు చెందిన పెయింటర్ సదానందన్ ఒక లాటరీ టికెట్ కొన్నాడు. ఇంకకొన్ని గంటల్లో లాటరీ తీస్తారనగా సదానందన్ టికెట్ కొన్నాడు. క్రిస్మస్ సందర్భంగా లాటరీ టికెట్ ధరను రూ.300 గా నిర్ణయించారు.
కేరళలో లాటరీ విధానం చాలా ఏళ్ల నుంచి అమలులో ఉంది. కేరళ స్టేట్ లాటరీస్ పేరుతో 1967 నుంచే అక్కడ లాటరీ సిస్టమ్ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వమే లాటరీ నిర్వహణ బాధ్యతను చూసుకుంటుంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా తీసిన లాటరీలోనే సదానందన్కు 12 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అది ఫస్ట్ ప్రైజ్. కొన్ని గంటల్లో లాటరీ తీస్తారనగా సదానందన్ లాటరీ టికెట్ కొనడం.. ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకోవడంతో సదానందన్.. స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
సెకండ్ ప్రైజ్లో భాగంగా రూ.3 కోట్లు, థర్డ్ ప్రైజ్లో భాగంగా రూ.60 లక్షలను లాటరీలో భాగంగా గెలిచిన వాళ్లకు అందజేస్తారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా 24 లక్షల టికెట్లను ప్రింట్ చేసి లాటరీ డిపార్ట్మెంట్ వాటిని విక్రయించింది. గత సంవత్సరం సెప్టెంబర్లో ఆటో డ్రైవర్కు ఓనమ్ పండుగ సందర్భంగా లాటరీ టికెట్ ద్వారా 12 కోట్లు గెలుచుకున్నాడు. ఆ తర్వాత తాజాగా పెయింటర్ అయిన సదానందన్ 12 కోట్లు గెలుచుకున్నాడు. ఈ డబ్బును తన పిల్లల బాగోగుల కోసం ఖర్చు పెడతానని సదానందన్ చెప్పుకొచ్చాడు.