న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం అందించే ‘పద్మ’ పురస్కారాల ఆన్లైన్ నామినేషన్లు, సిఫారసుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కేవలం ఆన్లైన్ ద్వారా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in)ద్వారా మాత్రమే నామినేషన్లు, సిఫారసులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. నిర్దేశిత నమూనాలో, 800 పదాల వివరణ మించకుండా నామినేషన్లు, సిఫారసుల వివరాలను పోర్టల్లో పొందు పరచాలని సూచించింది.