తమిళనాడు : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. టీవీకే పార్టీ చీఫ్ (TVK) విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ఆ హ్వానించాలని ఎక్స్ వేదికగా గవర్నర్కు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ కూటమికి లేదా ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించనప్పుడు గవర్నర్ కర్తవ్యం ఏమిటి? శాసనసభ సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా, అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఏకైక పార్టీ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఇది రాజకీయ నియమం అన్నారు. ఇది పార్లమెంటరీ సంప్రదాయం పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకుడికి మెజారిటీ మద్దతు ఉందని నిరూపించుకోవాల్సిన వేదిక అసెంబ్లీనే తప్ప గవర్నర్ భవనం కాదు. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అని గుర్తు చేశారు.
சட்டமன்றத் தேர்தலில் எந்த அரசியல் கூட்டணிக்கும் அல்லது அரசியல் கட்சிக்கும் தனிப் பெரும்பான்மை கிடைக்கவில்லை என்றால், ஆளுநரின் கடமை என்ன?
சட்டமன்ற உறுப்பினர்களின் எண்ணிக்கை அடிப்படையில் முதன்மைக் கட்சியின் தலைவரை ஆட்சி அமைக்க அழைக்க வேண்டும்.
இது தான் அரசியல் விதி. இது தான்…
— P. Chidambaram (@PChidambaram_IN) May 8, 2026