న్యూఢిల్లీ : ఓయో (Oyo) వ్యవస్ధాపకులు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ శుక్రవారం మరణిచారు. తమకు మార్గదర్శి, నిరంతరం స్ఫూర్తి రగిలించే తండ్రి రమేష్ అగర్వాల్ ఈరోజు మరణించారని భారమైన హృదయంతో తానూ, తన కుటుంబం వెల్లడిస్తున్నామని రితేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయన సంపూర్ణ జీవితాన్ని గడిపారని, రోజూ తమతో పాటు ఎంతో మందికి స్ఫూర్తి కలిగించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం తమ కుటుంబానికి తీరని లోటని, తమ తండ్రి చూపిన బాటలో సంక్లిష్ట సమయాన్ని అధిగమిస్తామని పేర్కొన్నారు.
కాగా, ఓయో అధిపతి రితేష్ అగర్వాల్కు ఇటీవల గీతాన్ష సూద్తో వివాహం కాగా ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.ఈ రిసెప్షన్కు బిలియనీర్ ఇన్వెస్టర్, సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ ఫౌండర్ మసయోషి సాన్ కూడా హాజరయ్యారు.
Read More :