న్యూఢిల్లీ : బహిష్కృత బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని పలువురు ముస్లిం మత పెద్దలతో పాటు పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమెను బీజేపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నుపుర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మహ్మద్ ప్రక్తపై బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య (ఓఐసీ) భగ్గుమంది. భారత్పై తగు చర్యలు చేపట్టాలని ఐరాసను కోరిన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో ఈ విషయం పెద్ద ఎత్తున మారిందని, అందుకే బలవంతంగా జాతీయ అధికార ప్రతినిధిపై చర్యలు బీజేపీ చర్యలు తీసుకున్నదని విమర్శించారు. పార్టీ నుంచి పది రోజుల కిత్రమే సస్పెండ్ చేయాల్సిందన్నారు. ఈ సందర్భంగా ఓవైపీ ప్రతిపక్ష పార్టీలపై సైతం మండిపడ్డారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని ఆరోపించారు.