హైదరాబాద్ : యూపీలో పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంటి నుంచి రూ 180 కోట్ల నగదు పట్టుబడిన ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్గా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు. 2016లో నోట్ల రద్దు ప్రయోగం ఫలవంతమైతే కాన్పూర్లోని ఓ వ్యాపారి వద్ద నగదు రూపంలో అంత సంపద ఎలా పోగుపడుతుందని ప్రశ్నించారు.
నోట్ల రద్దు అమలైనా కాన్పూర్ వ్యాపారి వద్ద రూ 180 కోట్ల నగదు ఎలా పట్టుబడిందో ప్రధాని మోదీ వెల్లడించాలని ఓవైసీ నిలదీశారు. నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలమైందని ప్రధాని అంగీకరించాలని అన్నారు. మోదీ నిర్ణయం చిన్న మధ్యతరహా పరిశ్రమలను, ఉద్యోగాలను దెబ్బతీసిందని గుర్తుచేశారు.
కాన్పూర్ వ్యాపారి ఇంట భారీగా నగదు పట్టుబడిన వ్యవహారం విపక్షాల నిర్వాకాన్ని బట్టబయలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ కాన్పూర్ ర్యాలీలో సమాజ్వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు.