న్యూఢిల్లీ: సుమారు రూ.2079 కోట్ల విలువైన ఎనిమి ప్రాపర్టీ(Enemy Property)ని అమ్మినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 1947 నుంచి 1962 మధ్య తమ ఆస్తుల్ని వదలేసి, చైనా, పాకిస్థాన్ పౌరసత్వం తీసుకున్న వారికి చెందిన సంపదను ఎనిమి ప్రాపర్టీగా పిలుస్తారు. దీనిపై కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఇవాళ లోక్సభలో ప్రకటన చేశారు. ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ ప్రాపర్టీకి చెందిన షేర్లను అమ్మేసినట్లు మంత్రి వెల్లడించారు. యూపీలోని 19 ఎనిమి ప్రాపర్టీలను అమ్మేశామని, వాటి షేర్ విలువ 2709 కోట్లు ఉన్నట్లు చెప్పారు. ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని భారతీయ ఖాజానాలోకి జమ చేస్తారన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ వాల్యువేషన్ జరుగుతుందన్నారు. దేశంలో సుమారు 12,611 ఎనిమి ప్రాపర్టీలు ఉన్నాయని, వాటి విలువ కనీసం లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.