భువనేశ్వర్/రాంచి, డిసెంబర్ 8: జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్లలో నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు రూ.220 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.
‘దేశ ప్రజలు నోట్లతో నిండిన ఈ కుప్పను చూసి వారి నిజాయితీ ప్రసంగాలు వినాలి. ఏదైతే వారు ప్రజల వద్ద నుంచి దోచుకున్నారో చివరి రూపాయి వరకు తిరిగి ఇవ్వాల్సిందే. ఇది మోదీ ఇస్తున్న హామీ’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.