చండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పాటియాలా ఎంపీ అయిన ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. బీజేపీకి అనుకూలంగా వహరిస్తుండటంతో అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్పై పార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధికార ట్విట్టర్లో దీనిని పోస్ట్ చేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ భార్య, లోక్సభ ఎంపీ ప్రణీత్ కౌర్ను కాంగ్రెస్ పార్టీ నుంచి శుక్రవారం బహిష్కరించినట్లు అందులో పేర్కొంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడికి ఫిర్యాదు అందడంతో పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో అన్నది మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రణీత్ కౌర్ను కోరింది.
కాగా, 2021 నవంబర్లో పంజాబ్ సీఎం పదవి నుంచి తప్పుకున్న అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటైనా గెలువలేదు. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీని అందులో విలీనం చేశారు. అయితే పాటియాలా ఎంపీ అయిన అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ ఇప్పటి వరకు కాంగ్రెస్లోనే కొనసాగారు.
Congress MP (Lok Sabha) from Patiala Preneet Kaur has been suspended from the Party with immediate effect. pic.twitter.com/z8mBZYEicl
— ANI (@ANI) February 3, 2023