లక్నో, ఆగస్టు 5: యూపీలోని ప్రభుత్వ లాలా లజ్పతి రాయ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందిన 81 మందికి పైగా గర్భిణులకు హెచ్ఐవీ వ్యాధి సోకిందని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 35 మంది ఇప్పటికే ప్రసవించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందా? లేదా మరేదైనా కారణాలున్నాయా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2022-23లో 33 కొత్త కేసులు నమోదు కాగా, వీటికి అదనంగా ఈ ఏడాది జూలైలోనే 13 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని, అంతకుముందు 35 మందికి కూడా ఇది సోకిందని ఏఆర్టీ సెంటర్ తెలిపింది. వ్యాధి బారిన పడ్డ వారు ప్రస్తుతం ఏఆర్టీ సెంటర్లో చికిత్స పొందుతున్నారు.