జలంధర్, మే 17: సరిహద్దు వద్ద డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ను భారత సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో చోటు చేసుకున్న రెండు సంఘటనల్లో 15.5 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ రెండు ఘటనలు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో కిలో హెరాయిన్ రూ.7 కోట్ల వరకు ధర పలుకుతున్నది.