న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 14,461 బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్లో అధికంగా 1,277 ఖాళీలు ఉండగా, తర్వాతి స్థానాల్లో తమిళనాడు(1,220), కర్ణాటక(1,053), పశ్చిమబెంగాల్(1,043) ఉన్నాయని, సిక్కింలో అత్యల్పంగా 12 పోస్టులు మాత్రమే భర్తీ కాలేదని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఖాళీల భర్తీ ప్రక్రియను కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) ప్రారంభించిందని తెలిపారు.