న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమవారం 15-18 సంవత్సరాల పిల్లలకు కొవిడ్ టీకాల పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 12.3లక్షల మందికిపైగా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ్టి మధ్యాహ్నం వరకు 15-18 సంవత్సరాల వయస్సున్న పిల్లలు 39.88లక్షల మంది పిల్లలు కొవిడ్ టీకా తీసుకునేందుకు కోవిన్ (CoWin) పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పిల్లల కొవిడ్ టీకాల పంపిణీ కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో సంభాషించారు.