న్యూఢిల్లీ: భారత్లో 60 ఏళ్లు దాటిన సుమారు కోటి మందికిపై వృద్ధుల్లో జ్ఞాపకశక్తి లోపం(dementia) ఉన్నట్లు ఓ సర్వే తెలిపింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఉన్న రీతిలో ఆ రేటు ఉన్నట్లు పేర్కొన్నారు. న్యూరోఎపిడమాలజీ(neuroepidemiology) జర్నల్లో ఆ నివేదికను పబ్లిష్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)టెక్నిక్ తో ఈ స్టడీ చేపట్టారు. సుమారు 31477 మంది వృద్ధుల డేటా ఆధారంగా ఈ విషయాన్ని తేల్చారు.
60 ఏళ్లకు పైబడిన వారిలో డిమెన్షియా(Dementia) వ్యాధి సుమారు 8.44 శాతం మందిలో ఉంటుందని అంతర్జాతీయ పరిశోధకులు భాఇస్తున్నారు. అయితే అమెరికా(US)లో ఆ రేటు 8.8 శాతం కాగా, ఇక బ్రిటన్లో ఆ రేటు 9 శాతం, జర్మనీలో 8.5 శాతం, ఫ్రాన్స్లో 9 శాతంగా ఉంది.
చదువులేని గ్రామీణ వృద్ధ మహిళ(rural oldage woman)ల్లో మతిమరుపు సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు స్టడీలో గుర్తించారు. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ సర్రే(university of surrey)కు చెందిన రచయిత హవోమియా జిన్(Haomiao Jin) ఈ రిపోర్టును పొందుపరిచారు. 30 వేల మంది వృద్ధులను స్టడీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డేటాను విశ్లేషించామని జిన్ తెలిపారు.