న్యూఢిల్లీ: తుర్కియేలో సంభవించిన భూకంపంలో మరణించిన కుటుంబాలకు రాజ్యసభ నివాళి అర్పించింది. వరుసగా మూడు భూకంపాలు రావడం వల్ల తుర్కియే, సిరియా దేశాల్లో సుమారు నాలుగు వేలకుపైగా మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకర్ తెలిపారు. ఇవాళ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఆరో తేదీన 7.8 తీవ్రతతో తుర్కియేలో భూకంపం వచ్చినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వరుసగా వందల సంఖ్యలో ప్రకంపనలు నమోదు అయినట్లు వెల్లడించారు. రెండు దేశాల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు చెప్పారు.
India's Humanitarian Assistance and Disaster Relief (HADR) capabilites in action.
The 1st batch of earthquake relief material leaves for Türkiye, along with NDRF Search & Rescue Teams, specially trained dog squads, medical supplies, drilling machines & other necessary equipment. pic.twitter.com/pB3ewcH1Gr
— Arindam Bagchi (@MEAIndia) February 6, 2023
తుర్కియే, సిరియా దేశాలకు ఇండియా తన వంతు సహాయాన్ని అందిస్తోందని జగదీప్ ధన్కర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రెస్క్యూ టీమ్ అక్కడకు వెళ్లిందని, ప్రత్యేక శిక్షణ పొందిన శునకాలు, వైద్య పరికరాలు, ఇతరు ఇక్విప్మెంట్ కూడా అక్కడకు వెళ్లినట్లు ఆయన చెప్పారు. తుర్కియే, సిరియా ప్రజలకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుర్కియే వెళ్లిన విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బగ్చి కూడా తన ట్విట్టర్లో తెలిపారు.
First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye.
Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023
మరో వైపు అదానీ అంశంపై చర్చ చేపట్టాలని, ఆ సంక్షోభంపై నిజాలు తేలేందుకు జేపీసీ వేయాలని కోరుతూ ఇవాళ కూడా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో లోక్సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.