న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులకు లైసెన్స్ ఉండాలని టెలికం ఆపరేటర్ల సంఘం కాయ్ సూచించింది. ఈ కమ్యూనికేషన్ సర్వీసులు టెలికం కంపెనీలకు పరిహారం చెల్లించేలా (డాటా ట్రాఫిక్ ఏర్పడుతుండటంతో) నిబంధనలు ఉండాలని కోరింది. టెలికం ముసాయిదా బిల్లు రూపకల్పనలో భాగంగా ఓటీటీ కమ్యూనికేషన్ సేవలను ఎలా నిర్వచించాలన్న దానిపై ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు కాయ్ డైరెక్టర్ జనరల్ కొచ్చర్ తెలిపారు.
ఆదాయంలో, వాటా పంపకం విషయంలో నిబంధనలు రూపొందించాలని కోరినట్టు చెప్పారు. ఓటీటీలు నెట్వర్క్ ఆపరేటర్లలాగే వాయిస్, వీడియో సేవలను అందిస్తున్నాయని, కానీ వీటికి ఎలాంటి లైసెన్స్ లేదని కాయ్ వాదిస్తున్నది. పన్నులు, సుంకాల రూపంలో దాదాపు 30% ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని, ఓటీటీలు పైసా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.