కర్నాటక వేదికగా ప్రారంభమైన హిజబ్ వివాదం ఇంకా రగులుతూనే వుంది. ఇదే విషయంపై ముస్లిం దేశాల ఐక్య సంఘటన తాజాగా స్పందించింది. ఇదే విషయంపై మంగళవారం ఓ ట్వీట్ కూడా చేసింది. ‘భారత్లో ఉన్న ముస్లింలకు రక్షణ కల్పించాలి. వారి అవసరాలు, ఇబ్బందులపై దృష్టి సారించాలి. ముస్లిం జీవన విధానాన్ని ఆచరించే వారికి పూర్తి రక్షణ కల్పించాలి. హింసను ప్రేరేపించేవారు, విద్వేషపూరితంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ ముస్లిం దేశాల ఐక్య వేదిక ట్వీట్ చేసింది. అంతర్జాతీయ సమాజం కూడా దీనిపై దృష్టి సారించి, మానవ హక్కులను కాపాడాలని కోరారు.
మీ పాఠాలు అవసరం లేదు : కేంద్ర మంత్రి
హిజబ్పై ముస్లిం దేశాల ఐక్య సంఘట చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్రంగా స్పందించారు. మీ ఉపదేశాలు భారత్కు అవసరం లేదు అని తేల్చి చెప్పారు. పాకిస్తాన్లో ఏ బాలిక అయినా జైశ్రీరాం అని నినదించగలుగుతుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు.