కోస్గి, మే 2 : కొడంగల్ నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో అభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయలు మం జూరు చేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి నూతన మున్సిపాలిటీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారుచేసి నిధులు మంజూరుచేయిస్తున్నా రు. దీంతో కోస్గి మున్సిపాలిటీలో అభివృద్ధిపనులు ముమ్మరం గా సాగుతున్నాయి. రూ.15 కోట్ల పలు వార్డుల్లో పనులు సాగుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని కోస్గి తమ హయాంలో మున్సిపాలిటీ రూపురేఖలు మారాలని అభివృద్ధి అంటేనే మా హయామని చెప్పుకునేలా ఉండాలని టీఆర్ఎస్ నాయకులు చిత్తశుద్ధితో పనులు చేయిస్తున్నారు.
రూ.2 కోట్లతో బస్డిపో నిర్మాణ పనులు పూర్తి
నూతనంగా రూ.2 కోట్లతో నిర్మించిన కోస్గి బస్ డిపో పను లు పూర్తి కావచ్చాయి. 90 శాతం పనులు పూర్తయ్యాయి. త్వర లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో డిపో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రకటించారు. అందుకు అ నుగుణంగా అధికారులు ప్రజాప్రతినిధులు వేగంగా పనులు చేయిస్తున్నారు. కాగా మరో కోటి రూపాయలతో బస్టాండ్ నిర్మా ణ పనులు సైతం సాగుతున్నాయి. నెలరోజుల్లో బస్టాండ్ పను లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను ఆదేశించారు.
ముమ్మరంగా శ్మశానవాటిక నిర్మాణం
సుమారు రూ. 90 లక్షల వ్యయంతో కోస్గి పట్టణశివారులో శ్మశానవాటిక నిర్మాణపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రహరీ నిర్మాణం, సీసీరోడ్డు నిర్మాణంతోపాటు షెడ్ల ఏర్పాటు, వైకుంఠధామం కమాన్ పనులు పూర్తయ్యాయి. 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 15 రోజుల్లో మిగిలిన పనులు పూర్తిచేస్తామని సంబంధిత కాంట్రాక్టర్ చెబుతున్నారు.
ఓపెన్ జిమ్
పట్టణంలో యువకులు వాకింగ్, రన్నింగ్ చేసిన తరువాత దేహదారుఢ్యం కోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఓపెన్జిమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అవసరమైన కొన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేస్తే పని పూర్తవుతుందని చెబుతున్నారు.
రూ. కోటీ ఇరవై లక్షలతో మార్కెట్ ఏర్పాటు
స్థానిక కూరగాయల మార్కెట్ సముదాయంలో వ్యాపారస్తుల సౌకర్యార్థం రూ.కోటీ ఇరవై ఐదు లక్షలతో నూతనంగా మార్కెట్ షెడ్లు ఏర్పాటు చేశారు. మంత్రి పర్యటనలో ఈ షెడ్లను సైతం ప్రారంభించి కూరగాయల వ్యాపారస్తులకు వ్యాపార నిమిత్తం అందుబాటులోకి తెస్తామని సంబంధిత కాంట్రాక్టర్ తెలిపారు.
పార్కుల ఏర్పాటు
ఉదయం సాయంకాలం కాలనీ ప్రజలు సేదతీరేందుకు పట్టణంలోని 12,7వ వార్డుల్లో రెండు పార్కులు ఏర్పాటుచేశారు. 12వ వార్డులో రూ.16 లక్షలు,7వ వార్డులో రూ. 14 లక్షలు మొత్తం ముప్పై లక్షలతో పార్కులు ఏర్పాటు చేస్తున్నారు.
చత్రపతి శివాజీ కూడలి విస్తరణ
పట్టణంలోని ప్రధాన కూడలి శివాజీ కూడలి. ఈ కూడలి విస్తరణకు యాభై లక్షల రూపాయలు కేటాయించారు. శివాజీ విగ్రహానికి చుట్టూ సర్కిల్ ఏర్పాటుచేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు చెబుతున్నారు.