పెట్రో, డీజిల్, వంటగ్యాస్పై పెరిగిన ధరలను నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు రాజ్యసభలో ఆందోళన నిర్వహించారు. ఈ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, తృణమూల్తో సహా ఇతర పార్టీ నేతలు ఆందోళన చేయడంతో రాజ్యసభ మంగళవారం రెండు సార్లు వాయిదా పడింది. ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విపక్షాల సభ్యులు స్పీకర్లోని వెల్ దగ్గరికి వచ్చి నినాదాలు చేశారు. ప్లకార్డులు చేత పట్టుకొని, వెల్ దగ్గరికి వచ్చి, నినాదాలు చేశారు.
మొదటి సారి వాయిదాపడ్డ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసాద్ ప్రశ్నోత్తరాలకు సమాయత్తమయ్యారు. ప్రతిపక్ష నేతలెవ్వరూ సభా నిర్వహణకు అడ్డురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయా పార్టీల సభ్యులు సీట్లలో కూర్చునేలా చూడాలని ఆయా ఫ్లోర్ లీడర్లను డిప్యూటీ చైర్మన్ సూచించారు. అయినా సభ్యులు వినలేదు. దీంతో డిప్యూటీ చైర్మన్ మరోసారి సభను వాయిదా వేశారు.
ఇక లోక్సభలోనూ ఇదే విధంగా ప్రతిపక్ష నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు పెరిగిన ధరలపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ విషయాన్ని ప్రస్తావించాలని స్పీకర్ ఓం బిర్లా వారికి సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు మండిపడ్డారు.