న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రం తవాంగ్ సెక్టార్లో ఈ నెల 9న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలపై ఇవాళ రాజ్యసభ అట్టుడికే అవకాశం ఉన్నది. భారత్-చైనా సరిహద్దు వివాదంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు.. రాజ్యసభలో రూల్ 267 కింద సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీస్లు ఇచ్చారు.
ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో సరిహద్దు ఘర్షణలపై ప్రకటన చేయాలని వారు తమ నోటీస్లలో డిమాండ్ చేశారు. రాజ్యసభ చైర్మన్ ప్రతిపక్ష సభ్యుల నోటీస్లను తోసిపుచ్చితూ సభలో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీస్ ఇచ్చిన ప్రతిపక్ష ఎంపీల్లో.. కాంగ్రెస్ ఎంపీలు రణ్దీప్ సుర్జేవాలా, రంజిత్ రంజన్, శక్తిసింహ్ గోహిల్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తదితరులు ఉన్నారు.