ఫతేహాబాద్: హర్యానాలోని ఫతేహాబాద్లో భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలు నిర్వహిస్తున్న ఇండియన్ నేషనల్ లోక్దళ్ (INLD) అధ్యక్షుడు ఓం ప్రకాష్ చౌతాలా ఆహ్వానం మేరకు వివిధ రాజకీయ పార్టీల అగ్ర నేతలు హాజరయ్యారు. వేడుకల అనంతరం నేతలు సమావేశమై దేశంలో బీజేపీయేతర కూటమి గురించి చర్చించనున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి ఈ సాయంత్రం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. జాతీయ స్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశంపై వారు సోనియాతో చర్చించనున్నారు. ఈ క్రమంలో దేవీలాల్ జయంతి వేడుకలకు హాజరైన విపక్ష ప్రముఖులతో కూడా నితీశ్కుమార్ ఈ అంశంపై చర్చిస్తారని సమాచారం.
దేవీలాల్ జయంతి వేడుకలకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్పవార్, జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఆర్జేడీ నాయకుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్, సీపీఎం నేత సీతారామ్ ఏచూరి హాజరయ్యారు.