న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి మార్గరెట్ అల్వా మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆగస్ట్ 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుండగా నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్ట్ 6న జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారం చివరిరోజు.
మార్గరెట్ అల్వా వెంట కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ రాజా, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి సహా పలువురు విపక్ష నేతలు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
#WATCH | Opposition's Vice-Presidential candidate Margaret Alva files her nomination papers at Parliament, in the presence of Congress leaders Rahul Gandhi, Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury, NCP chief Sharad Pawar, Shiv Sena's Sanjay Raut and other Opposition leaders. pic.twitter.com/oHmMvB6ij3
— ANI (@ANI) July 19, 2022
తనను బలపరిచిన విపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన మార్గరెట్ అల్వా ఈ ఎన్నికలు సవాల్తో కూడినవని తనకు తెలుసని, అయినా ధైర్యంగా ఎన్నికల బరిలో దిగానని ఆమె పేర్కొన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వైదొలగిన జగ్ధీప్ ధన్కర్పై మార్గరెట్ అల్వా (80) పోటీ చేస్తున్నారు. రాజస్ధాన్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మార్గరెట్ అల్వాను విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో నిలపాలని ఆదివారం ఏకగ్రీవంగా ఆయా పార్టీలు నిర్ణయించాయి.