పట్నా: బీహార్లో పట్టణ అధికారులు ఓ కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. పట్నా జిల్లాకు చెందిన మాసౌర్హీ టౌన్ అధికారుల నుంచి ‘డాగ్ బాబు’ అనే పేరుతో డిజిటల్ రూపంలో రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ అయ్యింది. సదరు కుక్క తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుత్తియా దేవి, చిరునామా వివరాలతో ఉన్న రెసిడెన్స్ సర్టిఫికెట్ను ప్రభుత్వ పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంచారు.
ఫొటోలో ఉన్నది ఓ కుక్క అన్న సంగతి చూసుకోకుండా ప్రభుత్వం దానికి ఓ రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీచేయటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ పాలనలో లోపభూయిష్టమైన వ్యవస్థకు ఇది నిదర్శమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సర్టిఫికెట్ను ఆమోదిస్తూ బీహార్ ఓటర్ల సర్వే(సర్)ను నిర్వహిస్తున్నారని, ఆధార్, రేషన్ కార్డులను లెక్కలోకి తీసుకోవటం లేదని ‘స్వరాజ్ ఇండియా’ సభ్యుడు యోగేంద్ర యాదవ్ ‘ఎక్స్’లో ఆరోపించారు.