పాట్నా, జూన్ 5: త్వరలో జరగనున్న విపక్షాల భేటికి పార్టీ అధ్యక్షులను మాత్రమే పంపాలని, ఆయా పార్టీల తరఫున వేరెవ్వరినీ అనుమతించమని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 12న వేరే కార్యక్రమాలున్నందున రాలేమని కాంగ్రెస్, మరో పార్టీ చేసిన విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు.
నితీశ్ ఏకపక్ష వైఖరి నచ్చకే?
విపక్షాల కూటమి ఏర్పాటుకు నితీశ్ పెద్దరికం వహించడం నచ్చకే కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు సమావేశాన్ని వాయిదా వేయించాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నితీశ్ కుమార్ ఏ క్షణం ఎలా వ్యవహరిస్తారో తెలియదని, అలాంటి వ్యక్తిని విపక్ష కూటమి ఏర్పాటు బాధ్యతను అప్పగించడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడుతున్నారు.