న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్.. మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వీడియోపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా క్లారిటీ ఇచ్చారు.
సత్యేందర్ జైన్ మసాజ్ చేయించుకోలేదని, వెన్నెముక నొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఫిజియోథెరపీ చేశారని చెప్పారు. అనారోగ్యానికి చికిత్స చేయించుకుంటున్న వీడియోను లీక్ చేసి బీజేపీ రాజకీయం చేస్తున్నదని ఆయన విమర్శించారు. బాధితులపై కూడా క్రూరమైన జోకులు వేయగల సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉన్నదని సిసోడియా వ్యాఖ్యానించారు.