న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు తీసుకున్న వారి సంఖ్య 27 నుంచి 28 శాతం ఉంటుందని నీతి ఆయోగ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ఇవాళ కేంద్ర మంత్రి మాండవీయ నేతృత్వంలో జరిగిన మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ప్రజలు అందరూ ప్రికాషన్ డోసు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ డోసు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రికాషన్ డోసు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికీ ఆ టీకాను సూచించినట్లు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. కోవిడ్ నిర్మూలన కోసం మూడవ డోసు రూపంలో ప్రికాషన్ డోసును కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే
ఒకవేళ మీరు కనుక జనం రద్దీ ఉండే ప్రదేశాల్లో ఉంటే అప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలన్నారు. వయసు ఎక్కువగా ఉన్న వారైనా, లేక ఏవైనా రుగ్మతులు ఉన్నవాళ్లు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని పౌల్ సూచించారు.