ముంబై: ఉల్లి ధరలు దారుణంగా పడిపోవటంతో రైతులంతా రోడ్డునపడ్డారు. మొన్న ఓ మహారాష్ట్ర రైతు పంటను కాల్చేయగా, మరికొందరు రైతులు ప్రధాని మోదీకి ఉల్లి పాయలు పార్సిల్ పంపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. మార్కెట్ల నుంచి ఉల్లిగడ్డలను కొనుగోలు చేయాలని మంగళవారం రెండు ప్రభుత్వ సంస్థలను ఆదేశించింది.