శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలోని నైనా బట్పోరాలో గురువారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగున్నది. ఉగ్రవాదులు ఇంకా ఘటనా స్థలంలో దాక్కోగా.. బలగాలు వారిని లొంగిపోవాలని సూచించాయి. సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కదలికలు నిలిచిపోయాయి. సామాన్య పౌరులను బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
నైనా బట్పోరాలో అనుమానిత వ్యక్తులను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలోనే బలగాలను గమనించిన ఉగ్రవాదులు సెక్యూరిటీ ఫోర్స్పై కాల్పులకు దిగాయి. దీంతో బలగాలు కాల్పులు జరగ్గా.. ఓ ఉగ్రవాది మరణించాడని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.