న్యూఢిల్లీ, జనవరి 21: ఒకరికి ఒకే కారు ఉండాలని, రెండో కారు కొనాలంటే పర్యావరణ పన్ను చెల్లించాలనే నిబంధనలు అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు జాతీయ స్థాయిలో ఒక కార్యాచరణ ఉండాలని, కార్ల వినియోగంపై పరిమితులు విధించాలని కోరుతూ సునామీ ఆన్ రోడ్స్ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని విచారించిన సీజేఐ డీవై చంద్రచూడ్, పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టేసింది. పిటిషనర్లు తమ అభ్యర్థనలను సంబంధిత అధికార యంత్రాంగానికి నివేదించాలని సూచించింది.