మూడుకు చేరిన బాధితుల సంఖ్య
తిరువనంతపురం, జూలై 22: దేశంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. కేరళకు చెందిన 35 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. బాధితుడు ఈనెల మొదట్లో యూఏఈ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో దేశంలో మంకీపాక్స్ బాధితుల సంఖ్య మూడుకు చేరింది.
ఈ మూడు కేసులు కూడా కేరళలోనే నమోదు కావడం గమనార్హం. మలప్పురానికి చెందిన వ్యక్తి ఈనెల 6న యూఏఈ నుంచి వచ్చాడని, 13 నుంచి జ్వరం వచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి వెల్లడించారు. ప్రస్తుతం రోగికి దవాఖానలో చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు.