గొంతు నులిమి హత్య.. ముగ్గురి అరెస్టు
న్యూఢిల్లీ, జూన్ 6: ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో 13 ఏండ్ల దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసి గొంతునులిమి చంపేశారు. బుధవారం రాత్రి బాలిక ఇంటిబయట నిద్రపోతున్న సమయంలో నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
గురువారం బాలిక మృతదేహం సమీపంలోని పొలాల్లో అచేతన స్థితిలో కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయగా బాలికపై లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.