రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. సుక్మా జిల్లాలోని చితల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం అటవీ ప్రాంతంలో డీఆర్జీ దళాలు, కోబ్రా పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయాడని ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు.
గతేడాది డిసెంబర్ 27న సుక్మా, బీజాపూర్ జిల్లాలోని చిన్నచెందా అటవీప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టులు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.