Lok Sabha Elections | గువాహటి: లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ అస్సాంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన లక్ష మంది విద్యార్థులు మంగళవారం తమ తల్లిదండ్రులకు పోస్ట్కార్డులు రాశారు. మే 7న జిల్లాలో మూడో విడతలో భాగంగా ఇక్కడ పోలింగ్ జరుగనున్నది. వందశాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం ‘మా ద్యూటాలోయ్, వోట్డానోర్ అహబాన్’ (ఓటు వేయమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి) ప్రచారం చేపట్టింది. కామ్రూప్ జిల్లా కమిషనర్, హైదరాబాద్కు చెందిన కీర్తి జల్లి మాట్లాడుతూ పిల్లలు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం ద్వారా వారిపై భావోద్వేగ ప్రభావం ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇది భవిష్యత్తు తరానికి పెద్దలను జవాబుదారీగా చేస్తుందని వివరించారు.