న్యూఢిల్లీ : ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఔషధాల విక్రయాన్ని నిరసిస్తూ ఆల్ ఆండియా కెమిస్ట్స్, అండ్ డ్రగ్గిస్ట్ల యూనియన్ దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. మానవతా దృష్టితో తాము తీసుకున్న నిర్ణయం కారణంగా అత్యవసర, ముఖ్యమైన మందులు అవసరమైన రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని యూనియన్ పేర్కొన్నది.
దేశంలోని తమ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న వారందరూ సమ్మెలో పాల్గొని పూర్తిగా విజయవంతం చేసినట్టు సంస్థ అధ్యక్షుడు జేఎస్ షిండే, ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింఘాల్ పేర్కొన్నారు. తమ సమస్యలకు సంబంధించి డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారుల ద్వారా ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్టు చెప్పారు. ఎలాంటి నియంత్రణ, ప్రిస్క్రిప్షన్లు లేకుండా అక్రమంగా ఆన్లైన్లో భారీ డిస్కౌంట్లతో ఔషధాలు విక్రయిస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది లైసెన్స్డ్ కెమిస్టులు, డ్రగ్గిస్టులకు తీవ్ర నష్టం ఏర్పడుతున్నదని చెప్పారు.