న్యూఢిల్లీ: పీఎం ఈవిద్య ద్వారా ప్రసారం చేస్తున్న ‘ఒక తరగతి, ఒక టీవీ ఛానల్’ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్న 12 నుండి 200 టీవీ ఛానళ్లకు విస్తరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో అన్ని రాష్ట్రాలు 1 నుండి 12 తరగతి వరకు ప్రాంతీయ భాషలలో అనుబంధ విద్యను అందించడానికి ఇది వీలు కల్పిస్తుంది చెప్పారు. అలాగే Udyam,e-shram, NCS, Aseem పోర్టల్స్ వంటి MSMEలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తామని, వాటి పరిధిని విస్తరిస్తామని చెప్పారు. దీంతో అవి GC, BC & BB సేవలను అందించే లైవ్ ఆర్గానిక్ డేటాబేస్లతో క్రెడిట్ ఫెసిలిటేషన్, ఎంటర్ప్రెన్యూర్ అవకాశాలను మెరుగుపరిచే పోర్టల్లుగా పని చేస్తాయని అన్నారు.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగం యువతకు ఉపాధి కల్పించడానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుందని నిర్మాలా సీతారామన్ తెలిపారు. దీంతో ఈ రంగాల మార్గాలను సిఫార్సు చేయడానికి, మార్కెట్లకు, ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా సేవలందించడానికి, దేశీయ ఏవీజీసీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అన్ని వాటాదారులతో కలిసి ఏవీజీపీ ప్రమోషన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.