CSIR | కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబీ కలాయి సెల్వి నియమితులయ్యారు. దేశంలోని 38 రీసెర్చ్ ఇన్స్ట్యూషన్ల కన్సార్టియంగా సీఎస్ఐఆర్ ఉంది. దానికి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళా శాస్త్రవేత్త. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్గా శేఖర్మండే స్థానంలో నియమితులయ్యారు. గత ఏప్రిల్లో శేఖర్ మండే రిటైరయ్యారు. నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి రాజేశ్ గోఖలే అదను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
లిథియం అయాన్ బ్యాటరీలపై పరిశోధనలు జరిపారు. ప్రస్తుతం తమిళనాడులోని కరాయికుడిలో గల సీఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని అంబ సముద్రం అనే చిన్న పట్టణంలో జన్మించారు. 25 ఏండ్లుగా ఆమె ఎలక్ట్రో కెమికల్ పవర్ సిస్టమ్స్పై పరిశోధనలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఎలక్ట్రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్గా ఆమె రెండేండ్లు కొనసాగుతారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు లేదా రెండేండ్లు పూర్తయ్యే వరకు ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన విభాగం కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తారు.