ఇండోర్: భారత్కు వచ్చిన భర్త కరోనాతో మరణించగా చైనాలోని ఆయన భార్య లైవ్ వీడియో ద్వారా అంత్యక్రియలు వీక్షించి విలపించారు. 40 ఏండ్ల మనోజ్ శర్మ చైనాలోని ఒక బ్యాంకులో పని చేస్తూ కుటుంబంతో కలిసి అక్కడ ఉంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో అనారోగ్యంతో ఉన్న బంధువును దగ్గర ఉండి చూసుకునేందుకు ఇటీవల భారత్ వచ్చారు. అయితే మనోజ్ శర్మకు కరోనా సోకింది. ఇండోర్లోని శ్రీ అరబిందో ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్లో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు.
ఈ నేపథ్యంలో మనోజ్ శర్మ మృతదేహానికి అంత్యక్రియల కోసం చైనాలోని ఆయన భార్య అనుమతి పొందారు. ఒక కార్యకర్త సహాయంతో మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించగా చైనాలోని ఆయన భార్య వీడియో కాల్ ద్వారా వీక్షించి కన్నీటిపర్యంతమయ్యారు. అనారోగ్యానికి గురైన బంధువు బాగోగులు చూసేందుకు ఇండియాకు వచ్చిన భర్త కరోనాతో మరణించి తిరిగిరాని లోకానికి వెళ్లడాన్ని చైనాలోని మనోజ్ శర్మ భార్య జీర్ణించుకోలేకపోతున్నారు.