న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque)పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదులో త్రిశూలం ఎందుకు ఉందని, దాన్ని తాము పెట్టలేదని, అక్కడ జ్యోతిర్లింగం ఉన్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జ్ఞానవాపీ మసీదుపై ఇప్పటికే అలహాబాద్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా యూపీ సీఎం యోగి దానిపై కామెంట్ చేయడాన్ని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. మసీదులో ఆర్కియాలజీ శాఖ సర్వేను అలహాబాద్ కోర్టు నిలిపివేసిందని, కొన్ని రోజుల్లో తుది తీర్పు వస్తుందని అసద్ అన్నారు. కానీ ఇలాంటి సమయంలో సీఎం యోగి .. ఆ మసీదుపై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమే అవుతుందని ఓవైసీ అన్నారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని అసద్ విమర్శించారు.
#WATCH | On UP CM Yogi Adityanath’s Gyanvapi statement, AIMIM MP Asaduddin Owaisi says "CM Yogi knows that the Muslim side has opposed ASI survey in Allahabad High Court and the judgement will be given in a few days, still he gave such a controversial statement, this is judicial… pic.twitter.com/IuBSqMHepv
— ANI (@ANI) July 31, 2023
ముస్లింలపై యోగి వత్తిడి తేవాలనుకుంటున్నారని, అక్కడ 400 ఏళ్ల నుంచి మసీదు ఉందన్నారు. 400 ఏళ్ల నుంచి అక్కడ నమాజ్ జరుగుతోందని ఓవైసీ అన్నారు. దేశం చట్టాన్ని తయారు చేసినప్పుడు, దాన్ని ఫాలో కావాలన్నారు. బుల్డోజ్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. మాజీ ఎంపీని అక్కడ కాల్చి చంపినట్లు అసద్ ఆరోపించారు. మణిపూర్ రేప్ ఘటన గురించి ప్రస్తావిస్తూ.. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు.