న్యూఢిల్లీ: ఇవాళ రవిదాస్ 645వ జయంతి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఢిల్లీలోని కరోల్ బాగ్లో ఉన్న రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరానికి వెళ్లారు. అక్కడ ఆయన షాదాబ్ కీర్తన్లో పాల్గొన్నారు. ఆలయంలో ఉన్న భక్తులతో కలిసి మోదీ కచేరి చేశారు. కీర్తనలను ఆలపించారు. కులం, అస్పృశ్యత నిర్మూలనకు రవిదాస్ కీలకపాత్ర పోషించారు. ఎందరికో ఆయన ఇన్స్పిరేషన్గా నిలుస్తారని ప్రధాని మోదీ అన్నారు. గురు రవిదాస్ మాఘ పూర్ణిమా రోజున పుట్టారు. 1377వ సంవత్సరంలో వారణాసిలోని మందౌధి వద్ద ఆయన జన్మించారు. రవిదాస్ ఓ కవి, సామాజిక సంస్కర్త, ఆధ్మాత్మిక గురువు. భక్తి గీతాలు, కీర్తనలు, ఆధ్యాత్మిక బోధనలతో ఆయన భక్తి ఉద్యమాన్ని నడిపారు. సిక్కు మతస్థుల పవిత్ర గ్రంధం ఆది గ్రంథ్లో 40 పద్యాలు రాశారు.
#WATCH | Prime Minister Narendra Modi takes part in 'Shabad Kirtan' at Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi's Karol Bagh on the occasion of Ravidas Jayanti
Source: DD pic.twitter.com/pa2YLWqFnE
— ANI (@ANI) February 16, 2022
ఇక పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ కూడా కవి రవిదాస్ ఆలయాన్ని విజిట్ చేశారు. యూపీలోని వారణాసి వద్ద రవిదాస్ జన్మస్థలంలో ఉన్న ఆలయంలో ఆయన పూజలు చేశారు. 14వ శతాబ్ధానికి చెందిన రవిదాస్ దళితుల ఐకాన్గా భావిస్తారు. ఉదయం 4 గంటలకే ఆలయానికి వెళ్లిన ఆయన.. 45 నిమిషాల పాటు కీర్తనల్లో పాల్గొన్నారు. రవిదాస్ జయంతి సందర్భంగా పంజాబీలకు ఆయన విషెస్ తెలిపారు. పూజలు చేసేందుకు తాను ఈ ఆలయానికి వచ్చినట్లు చెప్పారు.
Uttar Pradesh | Punjab CM Charanjit Singh Channi offers prayers at Ravidas Temple in Varanasi on the occasion of Ravidas Jayanti pic.twitter.com/BrbpiLbdKx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2022