న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కొలీజియం సిఫార్సుల విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. జడ్జీల నియామకం, బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు గత ఏడాది చేసిన సిఫార్సులను అమలు చేయడంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్, మరో దానిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది.
గత నెల 26న జరిగిన విచారణలో కొలీజియం చేసిన సిఫార్సుల ఆమోదంలో కేంద్రం ఆలస్యం పట్ల ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కరించాలని అటార్నీ జనరల్కు సూచించింది.