భోపాల్: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో గురించి అడినందుకు ఒక జర్నలిస్ట్ చెంపపై మహిళ కొట్టింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆడీ కారులోని మహిళ, డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తిపై అరిచింది. తనను విడిచిపెట్టాలంటూ ఆ కారు నుంచి దిగింది. అటుగా బైక్పై వెళ్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఆ మహిళ ఇండోర్లోని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్కు శనివారం వచ్చింది. తన కజిన్తో వాగ్వాదం జరిగిందని, తాము ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులకు చెప్పింది. ఆ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఈ విషయం తెలిసిన మీడియా సిబ్బంది ఆ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వైరల్ అయిన కారు వీడియోపై ఆమె వివరణ కోరారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్న ఆ మహిళ ఒక జర్నలిస్ట్ చెంపపై కొట్టి అక్కడి నుంచి పరుగులు తీసింది. దీంతో మీడియా సిబ్బంది, పోలీసులు ఆమె వెంటపడ్డారు. కాగా, ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#NDTVBeeps | Woman Slaps Journalist On Being Asked About Viral Car Video pic.twitter.com/gFvqpysySP
— NDTV (@ndtv) November 6, 2022