చెన్నై: ఒక లారీ టోల్ ప్లాజాపైకి వేగంగా దూసుకెళ్లింది (truck rams toll plaza). అక్కడ ఆగి ఉన్న వాహనాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో టోల్ ప్లాజా వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లారీ ఈడ్చెకెళ్లిన వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మధురై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పలు వాహనాలు ఒక టోల్ గేట్ వద్ద ఆగి వెళ్లసాగాయి. ఇంతలో ఒక లారీ రాంగ్ సైడ్ నుంచి వేగంగా ఆ టోల్ ప్లాజా వైపు దూసుకువచ్చింది. గమనించిన టోల్ గేట్ సిబ్బంది సతీష్ కుమార్ ఆ లారీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అది అతడి మీదకు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
కాగా, ఆ టోల్ గేట్ వద్ద రుసుం చెల్లించేందుకు ఆగి ఉన్న వాహనాన్ని కూడా ఆ లారీ ఢీకొట్టింటి. దానిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ సంఘటనపై స్థానికులు స్పందించారు. లారీ డ్రైవర్ను పట్టుకుని కొట్టారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు. లారీ దూసుకెళ్లిన సంఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.