Attack on Nitish |బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఆదివారం దాడి జరిగింది. ఆయన సొంత పట్టణం బక్తియార్పూర్లో ఈ ఘటన జరిగింది. నితీశ్ కుమార్పై దాడి చేసిన వ్యక్తిని సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీల ఆధారంగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు.
దేశ స్వాతంత్య్రం కోసం బీహార్ నుంచి పోరాడిన స్వాతంత్య్రోద్యమ పోరాట యోధుడు శిల్భద్ర యాజి విగ్రహం బక్తియార్పూర్ పట్టణంలో ఉంది. బక్తియార్పూర్లోని దవాఖాన ప్రాంగణంలో గల శిల్ భద్రయాజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నితీశ్పై దాడి చేశాడు.
సదరు వ్యక్తి విగ్రహం వెనుక నుంచి అకస్మాత్గా ముందుకు వచ్చిన గబగబా వేదికపైకి దూసుకెళ్లాడు. నితీశ్పై దాడి చేశారు. ఆ వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడ్ని పక్కకు లాగి, పోలీసులకు అప్పగించారు.