PM Narendra Modi : ప్రధాని నరేంద్ మోడీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందే కలకలం రేగింది. ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ఒక అధికారి, అతడి బాడీగార్డ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిగా ఫోర్జరీ ఐడీ కార్డు కలిగిన వ్యక్తిని, అతడి బాడీగార్డ్ను అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో వీరు అనుమానాస్పందంగా సంచరించడంతో పోలీసులు తనిఖీ చేశారు. దాంతో, ఇద్దరూ దొరికిపోయారు. వీరి నుంచి ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఆరంభానికి భద్రతా వైఫల్యం నెలకొంది. ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ఆవిష్కరణకు ప్రధాని రాక నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులతో సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని తనిఖీ చేసిన పోలీసులు అనంతరం.. అదుపులోకి తీసుకున్నారు.
⚡Security Scare At PM Modi’s Mumbai Event: Armed Imposter Detained
Local police intercepted 24-year-old Rohan Parekh at the Nita Mukesh Ambani Cultural Centre after he allegedly tried to gain entry using a forged PMO identity card. (NDTV)
Officers recovered a firearm from an… pic.twitter.com/vilbNh7V7m
— RT_India (@RT_India_news) September 8, 2026
ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిగా నకిలీ ఐడీ కార్డు కలిగిన వ్యక్తిని రోషన్ పరేఖ్గా గుర్తించారు. అతడి బాడీగార్డ్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉన్నత స్థాయి భద్రత ఉన్నప్పటికీ వీరిద్దరు నకిలీ ఐడీ కార్డులతో అంత దూరం ఎలా రాగలిగారు? అనే కోణంలో ముంబై నేర విభాగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Imposter PMO official detained with bodygaurd carrying a gun ahead of PM Modi’s event in BKChttps://t.co/8GdHjt3sL0
— Economic Times (@EconomicTimes) September 8, 2026