దేశంలో ‘ఒమిక్రాన్’ భయం గుబులు పుట్టిస్తోంది. ఇలాంట తరుణంలో మనం సాధారణంగా చేయించుకునే టెసట్టుల్లో ఈ వేరియంట్ అసలు బయటపడుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ సందేహాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ బదులిచ్చారు. ఒమిక్రాన్పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరోనా వైరస్ను గుర్తించడానికి చేసే ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు ‘ఒమిక్రాన్’ వేరియంట్పై కూడా పనిచేస్తాయని ఆయన చెప్పారు. వీటిలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా బయటపడుతుందని, ఈ వేరియంట్ టెస్టులను తప్పించుకోలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు.
ఈ కరోనా వేరియంట్ పూర్తిగా వ్యాపించక ముందే తొందరగా గుర్తిస్తే మంచిదని చెప్పారు. కావున రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని చెప్పారు. కాగా, ఇప్పటి వరకూ దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్సుఖ్ మాండవీయ పార్లమెంటులో స్పష్టం చేశారు.